సీఐటీయు ఆధ్వర్యంలో ఘనంగా మేడే
దమ్మపేట,(విజయక్రాంతి): శ్రామిక ప్రజల అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం మేడే అని, తమ సమస్యలు పరిష్కారం కొరకు పోరాటాలు ఉదృతం చేస్తూ దోపిడి రహిత సమాజం అనే అంతిమ లక్ష్యం చేరుకునేందుకు కృషి చేసే రోజు అని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సీఐటీయు మండల కమిటీ ఆధ్వర్యంలో హమాలి అడ్డ, జిసిసి, సీఐటీయు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిసిసి అడ్డా వద్ద జరిగిన సభ కు సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు అధ్యక్షత వహించారు.
అనంతరం సభలో పిట్టల అర్జున్ మాట్లాడుతూ... ఆనాడు శ్రమజీవులు పై పని భారమే గాక పని గంటల భారం కూడా అధికంగా ఉండేదని, తమపై జరుగుతున్న శ్రమ దోపిడీని నిరసిస్తూ కార్మిక వర్గం అత్యంత చైతన్యంతో తమకు హక్కులు, చట్టాలు కల్పించాలని రక్తం చిందిస్తేనే ఈనాడు సమస్త కార్మిక లోకం వాటి ఫలాలను అనుభవిస్తుందని అన్నారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ... అనగదొక్కబడిన కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించాలని అన్నారు.






