10 March, 2026 | 7:11 PM

Breaking News

శుద్ధ జలాన్ని సద్వినియోగం చేసుకోవాలి

09-03-2026 01:55 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ప్రజల సంక్షేమంలో భాగంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న శుద్ధ జలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆదివారం జిల్లాలోని రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన జల మహోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా మొదటిసారి గ్రామంలో ప్రతి ఇంటికి శుద్ధ జలాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ లు సిద్ధికి, రాకేష్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.