తమిళనాడు గవర్నర్... బీజేపీ "గేట్ కీపర్"
07-05-2026 04:58 PM
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(TPCC Chief Mahesh Goud) అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు టీవీకేకు ఇచ్చిన తీర్పును గవర్నర్ అగౌరవపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్.. కేరళ పర్యటన పేరుతో జాప్యం చేయడం యాదృచ్ఛికం కాదన్నారు. గవర్నర్ .. కేరళ పర్యటన కుట్ర రాజకీయాల్లో భాగమే అన్నారు. గవర్నర్ రాజ్యంగ పదవిలో ఉన్న బీజేపీ గేట్ కీపర్ అని స్పష్టమవుతోందన్నారు.
రాజ్యాంగం ప్రకారం గవర్నర్ హోదా నామమాత్రమే అన్నారు. విచక్షణాధికారాన్ని బీజేపీ కోసం దుర్వినియోగం చేయడం రాజ్యంగ ద్రోహమని పేర్కొన్నారు. ప్రజల కలలను గవర్నర్ లోక్ భవన్ లో బంధించడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ రాజకీయ పావుగా వాడుకుంటే సమాఖ్య స్ఫూర్తికే ప్రమాదం అన్నారు.






