17 July, 2026 | 2:15 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

జ్ఞాపకశక్తి పెంచుకుందాం..

29-06-2025 12:00 AM

అధిక రక్తపోటు గలవారు డిమెన్షియాతో పాటు విషయాన్ని త్వరగా గ్రహించలేరని పరిశోధనలు చెబుతున్నాయి. డిమెన్షియాలో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతాయి. ఇవి రోజువారీ వ్యవహారాల్లో బాగా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే అధిక రక్తపోటు గల వృద్ధులు శారీరకశ్రమ, వ్యాయామంతో ఈ ముప్పును తగ్గించుకోవచ్చని అమెరికాలోని వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ అధ్యయనం సూచిస్తోంది.

వారానికి కనీసం ఒకసారైనా ఒంటికి చెమట పట్టించే.. గుండె, శ్వాస వేగం పెంచే వ్యాయామాలు చేసేవారికి విషయగ్రహణ లోపం, మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం చాలామంది వృద్ధులు వ్యాయామం చేస్తున్న నేపథ్యంలో ఇది మంచి కబురేనని చెప్పుకోవచ్చు.

వ్యాయామంతో ఇలాంటి ప్రయోజనాలు కనిపిస్తున్నట్లు తెలిస్తే కాస్త కఠినమైన వ్యాయామాలు చేయడానికి మరింత ఉత్సాహం చూపుతారనీ పరిశోధకులు భావిస్తున్నారు. అయితే 75 ఏళ్లు లోపువారిలోనే తీవ్రమైన వ్యాయామాలతో ఈ ప్రయోజనాలు కనిపిస్తుండటం గమనార్హం.