12 May, 2026 | 12:08 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

జ్ఞాపకశక్తి పెంచుకుందాం..

29-06-2025 12:00 AM

అధిక రక్తపోటు గలవారు డిమెన్షియాతో పాటు విషయాన్ని త్వరగా గ్రహించలేరని పరిశోధనలు చెబుతున్నాయి. డిమెన్షియాలో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతాయి. ఇవి రోజువారీ వ్యవహారాల్లో బాగా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే అధిక రక్తపోటు గల వృద్ధులు శారీరకశ్రమ, వ్యాయామంతో ఈ ముప్పును తగ్గించుకోవచ్చని అమెరికాలోని వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ అధ్యయనం సూచిస్తోంది.

వారానికి కనీసం ఒకసారైనా ఒంటికి చెమట పట్టించే.. గుండె, శ్వాస వేగం పెంచే వ్యాయామాలు చేసేవారికి విషయగ్రహణ లోపం, మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం చాలామంది వృద్ధులు వ్యాయామం చేస్తున్న నేపథ్యంలో ఇది మంచి కబురేనని చెప్పుకోవచ్చు.

వ్యాయామంతో ఇలాంటి ప్రయోజనాలు కనిపిస్తున్నట్లు తెలిస్తే కాస్త కఠినమైన వ్యాయామాలు చేయడానికి మరింత ఉత్సాహం చూపుతారనీ పరిశోధకులు భావిస్తున్నారు. అయితే 75 ఏళ్లు లోపువారిలోనే తీవ్రమైన వ్యాయామాలతో ఈ ప్రయోజనాలు కనిపిస్తుండటం గమనార్హం.