2 May, 2026 | 9:21 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

ములుగు డిప్యూటీ కలెక్టర్‌గా కొత్తపల్లి కుశీల్ వంశీ

30-09-2025 02:38 AM

ములుగు, సెప్టెంబరు29(విజయక్రాంతి):ములుగు జిల్లా డిప్యూటీ కలెక్టర్గా కొత్తపల్లి కుశీల్ వంశీ సోమవారం ఉదయం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.కు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. విధుల్లో చేరిన కొత్తపల్లి కుశీల్ వంశీని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అభినందిస్తూ, ప్రజలకు సేవలందించే క్రమంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

అనంతరం తల్లి,తండ్రి బంధు మిత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర కేడర్లో డిప్యూటీ కలెక్టర్గా నియామకం పొందడం అభినందనీయమని అన్నారు. విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని బాధ్యతలను సమర్థవంతంగా   నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కోచింగ్ తీసుకున్న వివరాలను అడిగి తెసులుకున్నారు. ఉద్యోగ సాధనలో ప్రోత్సాహించిన తల్లితండ్రులను కలెక్టర్  ప్రత్యేకంగా అభినందించారు.