9 May, 2026 | 3:35 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

అందుబాటులోకి నాణ్యమైన వైద్యం

20-02-2026 05:55 PM

శ్రీ లేఖ హాస్పిటల్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

కోదాడ: కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ లేఖ హాస్పిటల్‌ను శుక్రవారం కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్  ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ... వైద్యో నారాయణో హరి అనే సూక్తిని స్మరిస్తూ, వైద్యాన్ని కేవలం వ్యాపారంగా చూడకుండా సామాజిక దృక్పథంతో రోగులకు సేవలు అందించాలన్నారు. ఆసుపత్రి వైద్యులు మీసా రోహిత్, కూరపాటి శ్రీలేఖ కోదాడలో సేవలు అందించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కారింగుల అంజి, వైద్యులు దశరథ, రామారావు, అశోక్, గౌరీనాథ్, ప్రసాద్, కరుణశ్రీ,  సురేష్,  కొత్తమాసు జనార్ధన్ పాల్గొన్నారు.