డీఎండబ్ల్యూఓని కలిసిన కోదాడ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు
05-08-2026 08:42 PM
కోదాడ,(విజయక్రాంతి): నూతనంగా సూర్యాపేట జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గా నూతనంగా చార్జి తీసుకుంటున్న వారిని కోదాడ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ వి యేసయ్య ఆధ్వర్యంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కోదాడ నియోజకవర్గ క్రైస్తవుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వెలిఫర్ జూనియర్ అసిస్టెంట్ చంద్రు, గిరి , కోదాడ నియోజకవర్గం పాస్టర్స్ ప్రభుదాస్, బ్రదర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






