9 May, 2026 | 11:44 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

అనంతపురంలో ఇసుజు మోటార్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం

26-01-2026 08:42 PM

అనంతపురం: కీలక ప్రాంతీయ మార్కెట్లలో కస్టమర్ల సౌకర్యం కోసం ఇసుజు మోటార్స్ తన సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఇసుజు మోటార్స్ ఇండియా అనంతపురములో తన కొత్త అధీకృత సర్వీస్ సెంటర్ (ఏఎస్‎సి) టోలీ మోటార్స్ ను అనంతపురంలో ప్రారంభించింది. ఈ  సర్వీస్ సెంటర్ ను ఇసుజు మోటార్స్ ఇండియా సీనియర్ అధికారులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో నెట్ వర్క్ టచ్‎పాయింట్ ప్రారంభించడం ద్వారా తన అమ్మకాల-అనంతర మౌలికసదుపాయాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యమంటున్నారు.

రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులో సేవా సహకారాన్ని అందించాలనే కంపెనీ యొక్క ప్రయత్నాల్లో భాగంగానే దీనిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అనంతపురములోని కొత్త సర్వీస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఐఎంఐ యొక్క 8వ కస్టమర్ టచ్‎పాయింట్ అనీ, ఇది రాష్ట్రంలోని కంపెనీ సర్వీస్ నెట్ వర్క్ ను మరింత శక్తివంతం చేసుందనీ ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టోరు కిషిమోటో అన్నారు.

ఈ ప్రాంతంలో వినియోగదారులకు విశ్వసనీయమైన, అధిక-నాణ్యత కలిగిన సేవలను అందించాలన్న నిబద్ధతే తమ లక్ష్యమని తెలిపారు. ఇసుజు మోటార్స్ ఇండియా వారి భాగస్వాముతో అనంతపురములో కొత్త అధీకృత సర్వీస్ సెంటర్ ప్రారంభినందుకు సంతోషంగా ఉందని,  ఆధునిక సదుపాయాలు ,సుశిక్షితులైన సిబ్బందితో అధిక-నాణ్యత కలిగిన సేవలను అందిస్తామని  టోలీ మోటార్స్ డీలర్ ప్రిన్సిపల్ ఆదినారాయణ చెప్పారు.