28 July, 2026 | 1:33 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల బందోబస్తు పరిశీలన

30-01-2026 01:17 PM

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

మెదక్, (విజయక్రాంతి): తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని అవసరమైన భద్రతా చర్యలను చేపట్టిందని తెలిపారు. ఈ ఎన్నికలలో మొత్తం 92 మంది ఓటర్లు  (మెదక్, నర్సాపూర్, అల్లదుర్గ్) చెందిన వారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కోర్టు పరిసరాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయబడిందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అదనపు ఎస్పీ పేర్కొన్నారు.