29 August, 2026 | 10:36 PM

రూ.1,759 కోట్ల పెట్టుబడులను రాబట్టిన ఇండెల్ మనీ

29-08-2026 09:49 PM

ముంబై, ఆగస్టు 28, 2026: ఇండెల్ మనీ లిమిటెడ్ యొక్క సెక్యూర్డ్, రేటెడ్, లిస్టెడ్, రీడీమబుల్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల (ఎన్సిడి) పబ్లిక్ ఇష్యూకు పెట్టుబడిదారుల నుండి అపూర్వమైన స్పందన లభించింది. రూ. 250 కోట్ల గ్రీన్‌షూ ఆప్షన్‌తో సహా మొత్తం రూ. 500 కోట్ల ఇష్యూ, ఆగస్టు 18, 2026న ప్రారంభమైన నాలుగు గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రయిబ్ చేయబడింది. రూ. 250 కోట్ల బేస్ సైజు మరియు అదనంగా మరో రూ. 250 కోట్ల వరకు చందాలను స్వీకరించే వెసులుబాటు కలిగిన ఈ ఇష్యూ, నిర్ణీత గడువు తేదీ కంటే ముందే ఆగస్టు 20, 2026న ముగిసింది. కంపెనీకి బేస్ ఇష్యూ పరిమాణంలో 704%కి సమానమైన రూ. 1,759 కోట్ల విలువైన బిడ్లు లభించాయి.

ఒక్కొక్కటి రూ. 1,000 ముఖ విలువ కలిగిన ఈ ఎన్ సి డిలు సంవత్సరానికి 12.25% వరకు ప్రభావవంతమైన రాబడిని అందిస్తాయి. వీటిని బిఎస్ఈ లిమిటెడ్ లో లిస్ట్ చేయాలని ప్రతిపాదించబడింది. 

ఇండెల్ మనీ హోల్-టైమ్ డైరెక్టర్ శ్రీ ఉమేష్ మోహనన్ మాట్లాడుతూ "ఈ ఇష్యూకు లభించిన అద్భుతమైన స్పందన, ఇండెల్ మనీ, మా వృద్ధి వ్యూహంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. రూ. 500 కోట్ల విలువైన మొత్తం ఇష్యూ కేవలం నాలుగు గంటల్లోనే సబ్‌స్క్రయిబ్ కావడం, ఆ తర్వాత మొత్తం సబ్‌స్క్రిప్షన్ రూ. 1,759 కోట్లకు చేరడం సంతోషించతగ్గ అంశం.

మేము మా రుణ కార్యకలాపాలను విస్తరిస్తున్న తరుణంలో పెట్టుబడిదారుల నుండి లభించిన ఈ స్పందన, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులు , వ్యాపారాల మారుతున్న రుణ అవసరాలను తీర్చడానికి తోడ్పడుతుంది. ఈ ఇష్యూ ద్వారా సమకూరే నిధులు ఇండెల్ యొక్క మూలధన స్థితిని బలోపేతం చేస్తాయి.

మా తదుపరి రుణ పంపిణీ, రీఫైనాన్సింగ్, రుణ సేవా అవసరాలకు మద్దతునిస్తాయి; అదే సమయంలో మా దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలను సాధించడానికి మాకు వీలు కల్పిస్తాయి" అని అన్నారు.ఈ ఇష్యూ ద్వారా వచ్చిన నికర ఆదాయాన్ని, వర్తించే నిబంధనలకు అనుగుణంగా... తదుపరి రుణ పంపిణీకి, ప్రస్తుత రుణాల ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్‌కు మరియు/లేదా రుణ సేవా కార్యకలాపాలకు (వడ్డీ చెల్లింపులు, అసలు మరియు వడ్డీని తిరిగి చెల్లించడం లేదా ముందుగానే చెల్లించడం వంటి వాటితో సహా) మరియు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు.