6 May, 2026 | 5:43 PM

Breaking News

క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ కు ఘన సత్కారం   •   రైతులకు రుణాలు, కొనుగోలు కేంద్రాలపై అవగాహన   •   సామల వారి వివాహ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ హాజరు   •   కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా   •   పంట సాగుపై రైతులకు అవగాహన   •   కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి   •   పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్   •   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం   •  

సామాజిక విప్లవ పితామహులు.. పూలే విగ్రహాల ఏర్పాటుకు సహకరిస్తా

06-05-2026 04:55 PM

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): సామాజిక విప్లవ పితామహులు బీసీల ఆరాధ్య దైవం మహాత్మ జ్యోతిరావు పూలే తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే విగ్రహాలను జవహర్ నగర్ లో ఏర్పాటు చేయటానికి సహకరిస్తానని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ బీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జంట విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి బుధవారం మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ను బీసీల ఐక్యవేదిక అధ్యక్షుడు సోమాచారి ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక కార్యవర్గం కలిసి  సమస్యలను వివరించారు. దీనికి వెంటనే స్పందించిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ సామాజిక విప్లవ పితామహుడు బిసిల ఆరాధ్య దైవం మహాత్మ జ్యోతిరావు పూలే తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలేల విగ్రహాలను జవహర్ నగర్ లో ఏర్పాటు చేయటానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.