7 April, 2026 | 11:14 AM

Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •  

వచ్చే వారంలో పత్తి కొనుగోలు చేయాల్సిందే

05-10-2025 12:47 AM

-రేపు జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో చర్చలు

-మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): వచ్చేవారంలో ఎటువంటి పరిస్థితు ల్లోనైనా పత్తి కొనుగోళ్లు చేయాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 341 జిన్నిం గ్ మిల్లులు ఉన్నా...ఇప్పటి వరకు పత్తి కొనుగోలు టెండర్లలో ఎవరూ పాల్గొనలేదని, వీరి సమస్యను కేంద్రం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినట్లు తెలిపారు. సోమవారం మరోసారి జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో సమావేశమై, వారికున్న సందేహాలు, భయాలను తొలగించాలని అధి కారులకు ఆయన శనివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. అధిక వర్షాల వల్ల రైతులు అనుకున్నంత మేర దిగుబడులు లేవని, ఈ సందర్భంలో రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని ఆయన హెచ్చరించారు.