1 September, 2026 | 4:15 PM

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

01-09-2026 04:08 PM

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు(Hydra Commissioner) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ హైడ్రా కమిషనర్(Hydra Commissioner) రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై(Single-Bench Orders) రంగానాథ్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ నిలిపివేసింది. తదుపరి విచారణ కోర్టు నవంబర్‌ 3కు వాయిదా వేసింది.