భూసేకరణకై చేపట్టిన సర్వేని పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ,సెప్టెంబర్ 01(విజయ క్రాంతి): హాసన్ పర్తి మండలం కోమిటిపల్లిలో రైల్వే సబ్ స్టేషన్ ఏర్పాటుకు కావలసిన భూమి కోసం ,అలాగే జయిగిరిలోని రైల్వే ట్రాక్ దగ్గర నిర్మించ తలపెట్టిన ఆర్వోబి, ఆర్యుబికి కావాలిసిన భూమి కోసం జరుగుతున్న సర్వే పనులను సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి(Collector Chahat Bajpai) పరిశీలించారు.అనంతరం భీమారం(Bhimaram) శివారులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం వద్ద నిర్మించ తలపెట్టిన స్పోర్ట్స్ స్కూల్ కోసం స్థలాన్ని కూడా కలెక్టర్ పరిశీలించి రెవిన్యూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరెట్(Collectorate)లోని మినీ కాన్ఫెరెన్స్ హల్లో కుడా, రెవిన్యూ, రైల్వే అధికారులతో కలెక్టర్ సమావేశంలో రైల్వే శాఖకి సంబందించిన భూ సేకరణ అంశాల మీద చర్చించి తగు సూచనలను చేశారు. ఈ సమావేశంలో ఆర్డివో వెంకటేశ్వర్లు, పిఓ అజిత్ రెడ్డి, ప్రశాంత్, జిల్లా మత్స్య శాఖ అధికారి పిల్లి శ్రీపతి, ఆర్ అండ్ బి ఈఈ చరణ్, ఎన్పీడీసీఎల్ ఎ ఈ.సామ్య నాయక్, రైల్వే అసిస్టెంట్ ఎక్సక్యూటివ్ ఇంజనీర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






