8 April, 2026 | 4:18 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

మంత్రి ఉత్తమ్‎కు హరీశ్ రావు లేఖ— ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హెచ్చరిక

08-04-2026 02:08 PM

హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డికి( Minister Uttam Kumar Reddy) మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ(Harish Rao Open Letter ) రాశారు. కాళేశ్వరం, దేవాదుల మోటార్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ఆన్-ఆఫ్ చేస్తే మోటార్లు, పంపులు దెబ్బతింటాయని సూచించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా?, లేకా కావాలనే చేస్తున్న కుట్రనా? అని ప్రశ్నించారు. భారీ మోటార్లు నిరంతరం నడిచేలా డిజైన్ చేసినవి.. పదేపదే ఆపితే తీవ్ర నష్టం వాటిల్లుతోందని హరీశ్ రావు తెలిపారు. వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా వాడటం సరికాదని చెప్పారు. డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని కోరారు. మీ రాజకీయాల కోసం ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని ఆయన హెచ్చరించారు.