మంత్రి ఉత్తమ్కు హరీశ్ రావు లేఖ— ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హెచ్చరిక
08-04-2026 02:08 PM
హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డికి( Minister Uttam Kumar Reddy) మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ(Harish Rao Open Letter ) రాశారు. కాళేశ్వరం, దేవాదుల మోటార్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ఆన్-ఆఫ్ చేస్తే మోటార్లు, పంపులు దెబ్బతింటాయని సూచించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా?, లేకా కావాలనే చేస్తున్న కుట్రనా? అని ప్రశ్నించారు. భారీ మోటార్లు నిరంతరం నడిచేలా డిజైన్ చేసినవి.. పదేపదే ఆపితే తీవ్ర నష్టం వాటిల్లుతోందని హరీశ్ రావు తెలిపారు. వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా వాడటం సరికాదని చెప్పారు. డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని కోరారు. మీ రాజకీయాల కోసం ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని ఆయన హెచ్చరించారు.






