సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్
₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం
కొత్తగూడెం, ఆగస్టు 1(విజయక్రాంతి): సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై సీసీఎస్ (CCS) సిబ్బంది మరియు సుజాతనగర్ పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడిలో ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి ₹52,100 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 5 స్మార్ట్ ఫోన్లు మరియు పేకముక్కలను స్వాధీనం (సీజ్) చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టవ్యతిరేకమైన పేకాట, జూదం లాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సుజాతనగర్ ఎస్సై రమాదేవి హెచ్చరించారు.
పట్టుబడిన నిందితుల వివరాలు
1.నునావత్ సంతోష్
2.భూక్య బిక్కులాల్
3.నున్సావత్ అశోక్ కుమార్
4.చల్ల రాజు
5.భూక్య వీరన్న
6.ఇస్లావత్ ప్రవీణ్ కుమార్
పరారీలో ఉన్న నిందితులు
1.కున్సోత్ వంశీ
2.భూక్య ప్రవీణ్
3.పల్లపు చంటి
4.బానోత్ గోపి
5.ధరావత్ రాజ్ కుమార్.






