పిడుగుపాటుకు నలుగురు మృతి
రాంచీ: జార్ఖండ్లోని(Jharkhand) రెండు జిల్లాల్లో పిడుగులు పడి(Lightning Strikes) ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారని శుక్రవారం పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు హజారీబాగ్ జిల్లాకు, ఒకరు ఛత్రా జిల్లాకు చెందినవారని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. హజారీబాగ్లోని కట్కమ్సాండి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాంచన్పూర్ గ్రామంలో గురువారం పిడుగుపాటుకు గురై ఒక దంపతులు మరణించారని పోలీసులు తెలిపారు.
మరణించిన దంపతులను వాసుదేవ్ మహతో (51), ఆయన భార్య దులియా దేవి (48)గా గుర్తించారు. వారు వరి పొలంలో పని చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని హజారీబాగ్ డీఎస్పీ సూచించారు. చౌతా గ్రామంలో మరణించిన వ్యక్తిని బస్వా దేవి (50)గా గుర్తించినట్లు బర్కథా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ తెలిపారు. చత్రా జిల్లాలోని పిపర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్యాణ్పూర్ మార్కెట్ నుండి హఫువాకు వెళ్తుండగా పిడుగుపాటుకు గురై 25 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు మరో అధికారి తెలిపారు. మరణించిన వ్యక్తిని హఫువా గ్రామానికి చెందిన పవన్ కుమార్ మహతోగా గుర్తించినట్లు పిపర్వార్ పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు.






