మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
10-08-2026 05:54 PM
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి. సోమవారం మాసాయిపేట గ్రామానికి చెందిన ఎండి బోలు తండ్రి ఎండి చిన్న బాబు మరణించగా వారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మల్లపురం గ్రామానికి చెందిన గుజ్జ కనకరాజు తండ్రి గజ్జ రామస్వామి మరణించిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.






