calender_icon.png 10 February, 2026 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజల పేరుతో దోపిడీ

10-02-2026 12:52:28 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి9 (విజయ క్రాంతి): పూజల పేర నమ్మించి ఓ వృద్దుని వద్ద పూజల పేరుతో బంగారు ఉంగరాన్ని దొంగిలించి పరారైన ముగ్గురు నిందితులను వారాసిగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5 గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న లలితానగర్లోని జామియా ఉస్మానియా రైల్వే స్టేష న్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు  ఓ వృద్దుడి వద్దకు వచ్చారు.

పూజలు చేస్తామని నమ్మించి వృద్ధుడి వద్ద ఉన్న అర తులం బంగారు ఉంగరాన్ని తీసుకున్నారు. అందులో ఒక  నిందితుడు ఉంగరాన్ని మిం గేసి, బయట ఆటోలో సిద్ధంగా ఉన్న మరో నిందితుడి తో కలిసి పరారయ్యాడు. దీంతో తాను మోసపోయాయనని గుర్తించిన వృద్దులు వారాసిగూడ పోలీసు స్టేషన్ కు వచ్చి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మధ్యప్రదేశ్కు చెందిన నిందితులు సుభాష్ నాథ్ (23), కరణ్ నాథ్(21), సోహన్ నాథ్ (23) అరెస్టు చేశారు.