21 April, 2026 | 5:12 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

పూజల పేరుతో దోపిడీ

10-02-2026 12:52 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి9 (విజయ క్రాంతి): పూజల పేర నమ్మించి ఓ వృద్దుని వద్ద పూజల పేరుతో బంగారు ఉంగరాన్ని దొంగిలించి పరారైన ముగ్గురు నిందితులను వారాసిగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5 గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న లలితానగర్లోని జామియా ఉస్మానియా రైల్వే స్టేష న్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు  ఓ వృద్దుడి వద్దకు వచ్చారు.

పూజలు చేస్తామని నమ్మించి వృద్ధుడి వద్ద ఉన్న అర తులం బంగారు ఉంగరాన్ని తీసుకున్నారు. అందులో ఒక  నిందితుడు ఉంగరాన్ని మిం గేసి, బయట ఆటోలో సిద్ధంగా ఉన్న మరో నిందితుడి తో కలిసి పరారయ్యాడు. దీంతో తాను మోసపోయాయనని గుర్తించిన వృద్దులు వారాసిగూడ పోలీసు స్టేషన్ కు వచ్చి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మధ్యప్రదేశ్కు చెందిన నిందితులు సుభాష్ నాథ్ (23), కరణ్ నాథ్(21), సోహన్ నాథ్ (23) అరెస్టు చేశారు.