10 May, 2026 | 7:44 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

'పది' విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

22-11-2025 06:39 PM

చిగురుమామిడి (విజయక్రాంతి): మండలంలోని తొమ్మిది జడ్‌పీ హై స్కూళ్లు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న 263 మంది విద్యార్థులకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు గంగిశెట్టి జగదీశ్వర్ శనివారం ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 2011 నుంచి ట్రస్ట్ పేద విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ చేస్తోందని, ఇప్పటివరకు 10 వేల మందికి పైగా విద్యార్థులు లాభపడ్డారని జగదీశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత భాషబత్తిని ఓదెలు కుమార్‌తో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.