3 April, 2026 | 3:34 PM

Breaking News

సాధ్వి నిరంజన్ జ్యోతి జీని కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   మార్పు రావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి.. జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •  

తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం

03-04-2026 01:03 PM

రథంపై కూర్చొనే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వివాదం

హామీ పత్రం రాయించుకున్న పోలీసులు

హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్(Toopran)లో ఉద్రిక్తతల మధ్య శ్రీరాముడి రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవం సందర్భంగా ఘర్షణలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. రథంపై కూర్చొనే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదం చేలరేగింది. మున్సిపల్ ఛైర్మన్ రవీందర్ గౌడ్ రథంపై కూర్చొవద్దని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఘర్షణలు తలెత్తనివ్వనని రవీందర్ చేత పోలీసులు హామీ పత్రం రాయించుకున్నారు.