26 May, 2026 | 5:25 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం

03-04-2026 01:03 PM

రథంపై కూర్చొనే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వివాదం

హామీ పత్రం రాయించుకున్న పోలీసులు

హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్(Toopran)లో ఉద్రిక్తతల మధ్య శ్రీరాముడి రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవం సందర్భంగా ఘర్షణలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. రథంపై కూర్చొనే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదం చేలరేగింది. మున్సిపల్ ఛైర్మన్ రవీందర్ గౌడ్ రథంపై కూర్చొవద్దని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఘర్షణలు తలెత్తనివ్వనని రవీందర్ చేత పోలీసులు హామీ పత్రం రాయించుకున్నారు.