26 May, 2026 | 4:22 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

ఎన్నికల చెక్‌పోస్టులు పరిశీలించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్

13-10-2025 11:39 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీసు కమిషనర్, డీసీపీ, ఏసీపీ బాలానగర్‌లతో కలిసి సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ కల్పతరువు జంక్షన్ వద్ద 13వ తేదీ రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్ట్‌ను సందర్శించారు. అనంతరం ఎర్రగడ్డ ప్రాంతంలోని కీలక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సందర్భంలో సనత్‌నగర్ పోలీసులు సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రేం నగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆక్టివా వాహనంపై ప్రయాణిస్తున్న జహీద్ ఖాన్ (రహమత్‌నగర్) అనే వ్యక్తి వద్ద రూ.2.70 లక్షల నగదు పట్టుబడింది. సరైన ఆధారాలు లేకుండా నగదు తీసుకెళ్తున్నందున ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.