8 July, 2026 | 8:20 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడికి సన్మానం

19-12-2025 05:44 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలో గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు శుక్రవారం మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మీ మీద నమ్మకంతో గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధే ద్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్య పేట జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధరవతు నవిన్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు,వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు