బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగేంద్రబాబు
మంగపేట, (విజయక్రాంతి) : అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని కూడా పాలకులకు అంటగట్టే నీచమైన బుద్దిని బీఆర్ఎస్ పార్టీ వీడనాడాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు హితవు పలికారు. శనివారం మండల కేంద్రమైన మంగపేటలో స్థానిక విలేకరులతో కర్రీ నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రమాదం జరిగితే ప్రభుత్వం చేసింది అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దుష్ప్రచారం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిత్యం ఏదోఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వంపైనా, రాష్ట్ర మంత్రి సీతక్క పైన బురద జల్లాలి అనే పద్ధతిని ఆచరిస్తున్నారని, ఆ పద్దతిని మార్చుకోవాలన్నారు.
గతoలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉనికి కోసం శవ రాజకీయలు చేశారని విమర్శించారు. ఇటీవల మేడారంలో అనుకోకుండా ప్రమాదం జరిగితే స్వార్థ రాజకీయo కోసం, దొరలు వారి స్వలాభం కోసం చిల్లర రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రమాదానికి గురై, అంగవైకల్యంతో తల్లడిల్లుతున్న చిన్నారిని చూచి కంటతడి పెట్టాల్సింది పోయి పార్టీ ఉనికి కోసం, రాజకీయ స్వలాభం కోసం సోషల్ మీడియాలో మెసేజులు పెట్టి పైశాచిక ఆనందం పొందటం వారి నిజానికి నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ అంటే బరి తెగింపు రాజకీయ సమితి పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు మానుకోవాలని,వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు అని అన్నారు.




