జీవో 97ను రద్దు చేయాలి
28-08-2026 12:59 AM
- విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం
- రాంచందర్ రావు, బీజేపీ నేతల అరెస్టును ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాం తి): జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడు తున్నదని, రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావుతో సహా పార్టీ నేతల హౌస్ అరెస్టులను ఖండిస్తున్న ట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. వివాదాస్పద జీవో 97ను తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని డిమా ండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ న డుపుతున్నది ప్రజాపాలన కాదు, పోలీసుల నిర్బంధపాలన అని విమర్శించారు. బీజేపీ నేతల అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనాని కి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు.






