18 April, 2026 | 1:03 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

పోలీస్ ప్రజావాణిలో 11 ఫిర్యాదులు

02-12-2025 02:14 AM

 ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, డిసెంబర్ 1 (విజయ క్రాంతి):నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే పోలీస్ ప్రజావాణి కార్యక్రమం గ్రామీణ ప్రజల ఆదరణ పొందుతోంది ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్.సాయి చైతన్య, ప్రజల సమస్యలను తెలుసు కొని వారి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు తమ సిబ్బందికి ఆదేశాలిస్తున్నారు.

సోమవారం రోజు జరిగిన ఈ కార్యక్రమంలో*ప్రజల వద్ద నుండి వివిధ ఫిర్యాదు లకు సంబందించిన 11 ఫిర్యాదు లను ఆయన స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. 

సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలుసుకొని పరిష్కారానికి సూచనలు తమ సిబ్బందికి చేశారు.

తమ సమస్యల పట్ల ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని *పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.