ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్
25-03-2026 01:48 AM
- అభిషేక్ సింఘ్వీ నివాసంలో విందుకు హాజరు
- నిధులు, అనుమతులపై నేడు కేంద్ర మంత్రులతో భేటీ
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం రాత్రి 8 గంటలకు రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. తెలంగాణ నుంచి రెండవసారి రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో అభిషేక్ సింఘ్వీ ఈ విందు ఏర్పాటు చేశారు.
కాగా రేవంత్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ సహా పార్టీకి సంబంధించి పలు కీలక అంశాలను హైకమాండ్తో బుధవారం చర్చించనున్నట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులను కలువనున్నారు.




