20-02-2026 07:56:43 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మల్లబోయిన మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అలాగే తంగళ్ళపల్లి లింగయ్య అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చల్మెడ లక్ష్మీనరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంకు వెళ్లి మల్లబోయిన మహేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే తంగళ్ళపల్లి లింగయ్య కుటుంబాన్ని కలిసి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సీనియర్ నాయకులు పొన్నం పర్షరాములు, నాగుల రాజు, సిద్ధంశెట్టి శ్రీనివాస్, కొమ్ము ఎల్లయ్య, ప్రశాంత్, గోపాల్, శివ తేజ తదితరులు పాల్గొన్నారు.