14 August, 2026 | 8:20 PM

Breaking News

సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసు ఉపసంహరించుకోవాలి

14-08-2026 07:16 PM

- హుజూరాబాద్‌లో ధర్నా, రాస్తారోకో

-​ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన హోరు

-​ జర్నలిస్టుల ఆందోళనకు ప్రజాసంఘాలు, బీఆర్ఎస్ మద్దతు

- ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి కాయిత రాములు, కామని రవీందర్ లు డిమాండ్

హుజూరాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని జర్నలిస్టుల నివేశన స్థలాల అంశంపై కాంగ్రెస్ నాయకుడు స్వామిరెడ్డి కోర్టులో దాఖలు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారంస్థానిక అంబేద్కర్ చౌరస్తాలో  ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిరెడ్డి వైఖరిని నిరసిస్తూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జర్నలిస్టులు చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి పలు ప్రజాసంఘాల నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

​ ఈ సందర్భంగా హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శి కాయిత రాములు, కామని రవీందర్ లు మాట్లాడుతూ... పట్టణంలో జర్నలిస్టులు గత రెండు దశాబ్దాలుగా నివేశన స్థలాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో కేసీ క్యాంప్ పరిధిలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఇప్పటికే పలువురు జర్నలిస్టులు అక్కడ నివాసాలు కూడా నిర్మించుకున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

​ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడు స్వామిరెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ, జర్నలిస్టుల స్థలాలపై న్యాయస్థానంలో కేసు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, సమస్యను సామరస్యంగా పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన గీతాలు పలువురుని ఆకట్టుకున్నాయి.

​ఈ కార్యక్రమంలో  పట్టణానికి చెందిన జర్నలిస్టులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రజాసంఘాల బాధ్యులు, చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, దేవసాని ప్రియదర్శిని, తునికి సమ్మయ్య,సందెల వెంకటేష్, మాడుగుల ఓదెలు, గడ్డం విశాల్,కౌన్సిలర్లు గందే శ్రీనివాస్ , వర్థినేని రవీందర్రావు,బిఆర్ఎస్ నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాధ ముత్యం రాజు,  అకె నపల్లి శిరీష, కొలిపాక సమ్మయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.