భూక్యా తిరుపతి నాయక్ ను పరామర్శ
13-08-2026 08:28 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ, బిఆర్ఎస్ నాయకుడు భూక్యా తిరుపతి నాయక్ తన ఎడమకళ్ళు కు గతంలో జరిగిన ప్రమాదంలో తన కాలుకు ఫ్రాక్చర్ అయినా కాళ్లకు ఇన్ఫెక్షన్ రావడంతో శస్త్రచికిత్స జరిగిన సందర్భంగా అతని ఇంటికి విచ్చేసి, పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు స్థానిక కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ బిఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు శ్రీనాథ్ గౌడ్, అంజి, విజయేందర్ రెడ్డి, సంపత్ గౌడ్, సాయిలతోపాటు స్థానిక నాయకులు ఉన్నారు.






