ప్రయాణికుల అవసరాల మేరకు బస్సులు
01-04-2026 07:32 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రీజియన్లు అన్ని డిపోల పరిధిలో ప్రయాణికులకు అనుకూలంగా టీజీ ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ఆర్ఎం భానుప్రసాద్ అన్నారు. బుధవారం నిర్మల్ డిపోను ఆకస్మికంగా సందర్శించి ప్రజా రవాణా పై సంబంధిత వివరాలను డీఎం పండరిని అడిగి తెలుసుకున్నారు.
నిర్మల్ డిపోలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు పెంచవలసిన అవసరం గుర్తించారు. యాత్రనందం సర్వీసుల ద్వారా భక్తులకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత పథకం అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం పండరీ. అధికారులు హర్ష రామయ్య రాజశేఖర్ నవీన్ రమణ తదితరులు పాల్గొన్నారు




