11 May, 2026 | 10:49 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

మోదీ సభకు వేములవాడ నుంచి బీజేపీ శ్రేణుల తరలింపు

11-05-2026 12:00 AM

వేములవాడ, మే10,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రాపెళ్లి శ్రీధర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్కు విచ్చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు హాజరవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వంగల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, పిన్నింటి హనుమాండ్లు,వాసం మల్లేశం, బిల్ల కృష్ణహరి, రేగుల శ్రీకాంత్, మామిండ్ల లక్ష్మీరాజం, మహంకాళి శ్రీనివాస్, మనోజ్, యశ్వంత్, మెరుగు లక్ష్మణ్, బాలశేఖర్, మల్లెపు లక్ష్మణ్తో పాటు పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.