13 April, 2026 | 5:19 PM

బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం

13-04-2026 03:38 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): హుజూర్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన అడ్వకేట్, మాజీ కౌన్సిలర్ జక్కుల వీరయ్య యాదవ్ ను మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, వార్డు సభ్యులు వశ్యానాయక్, పాండు నాయక్, అడ్వకేట్ చందు నాయక్ పాల్గొన్నారు.