ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య
బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో మన భవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్య భవన కొనసాగుతూ ఉండడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నేరడిగొండ గ్రామ సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహించి విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... మోజులో పడవద్దని డబ్బులు ఖర్చు చేసుకొని ప్రైవేటు పాఠశాలల్లో చదివించవద్దన్నారు. రానున్న సంవత్సరంలో నేరడిగొండ పాఠశాల నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కృషి చేస్తున్నారన్నారు. అన్ని రకాల వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించాలని ఆమె కోరారు.






