12 March, 2026 | 7:31 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

108 అంబులెన్స్ లో ఆడబిడ్డకు జననం

12-03-2026 05:09 PM

ఉట్నూర్, మార్చి 12 (విజయక్రాంతి) : ఇంద్రవెల్లి మండలం గట్టేపల్లి పంచాయతీ పరిధిలోని చిత్త గూడ కు చెందిన  సావిత్ర బాయి అనే గర్భిణీ 108 అంబులెన్స్ లో డెలివరీ అయింది. 108 అంబులెన్స్ పైలట్ రాజేష్, ఈఎంటి సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్త గూడ కు చెందిన  సావిత్రిబాయి గురువారం పురిటి నొప్పులతో    బాధపడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. చిత్తాగూడ నుంచి అంబులెన్స్ లో ఇంద్రవెల్లి పి.హెచ్.సి కి  తీసుకువచ్చిన తర్వాత సావిత్రి బాయి కి  రక్తహీనత ఉందని, రక్తం ఎక్కించవలసి ఉంటుందని వైద్యుల సూచనతో వెంటనే రిమ్స్ కు తీసుకు వెళ్తుండగా, పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ముత్తునూరు గ్రామ శివారులో అంబులెన్స్ లోనే ప్రసవించిందన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.