17 June, 2026 | 11:55 AM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

26న అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో అయ్యప్ప మహా పడిపూజ

24-11-2025 05:56 PM

ముకరంపుర (విజయక్రాంతి): కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ టెక్నో పాఠశాలలో ఈనెల 26న అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దైవ కార్యక్రమాలు చేయడం వలన సంతృప్తి కలుగుతుందని, భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా పొందుతామని అన్నారు. మహా పడిపూజ అనంతరం విచ్చేసిన వారందరికీ అల్ప ఉంటుందని తెలిపారు. జిల్లాలోని దీక్షాపరులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామి ఆశీస్సులు పొందాలని నరేందర్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో పలువురు దీక్షాపరులు, సిబ్బంది పాల్గొన్నారు.