17-02-2026 08:08:02 PM
కాప్రా తాసిల్దార్ బైరెడ్డి రాజేష్
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ భూముల పరిరక్షనే ధ్యేయంగా పనిచేస్తున్నామని కాప్రా తాసిల్దార్ బైరెడ్డి రాజేష్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ సర్వేనెంబర్ 417, 497లలో అక్రమంగా వెలసిన కట్టడాలను తాసిల్దార్ రాజేష్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం కూల్చివేతలు చేపట్టారు.
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఊరుకునేది లేదని కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే తమ ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.