21 March, 2026 | 3:27 PM

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోటలక్ష్మికాంతారావు

21-03-2026 01:47 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం రోజు పిట్లం మండల కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.వేడుకల్లో జుక్కల్  ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా అందరికీ శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలని, ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.. కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.