8 July, 2026 | 8:18 PM

Breaking News

ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •  

కొత్తపల్లి పట్టణంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

08-07-2026 07:14 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయం లో మాజీ కౌన్సిలర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గున్నాల రమేష్ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గున్నాల రమేష్ మాట్లాడుతూ... వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ 108, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచిపోయిన గొప్ప మనిషి అని స్మరించుకున్నారు. తదుపరి కేక్ కట్ చేసి, నివాళులర్పించడం జరిగింది.