12 July, 2026 | 2:15 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

అమెరికాలో వరంగల్ వాసి మృతి

17-03-2026 12:34 AM

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మరణం

మహబూబాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) ఆదివారం అమెరికాలో గుండెపోటుతో మృతిచెందారు. రాకేశ్ గత పదేండ్లుగా అమెరికాలోని వర్జీనియాలో ఉంటూ, ఉద్యోగం చేస్తున్నారు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

వారం వ్యవధిలోనే ముగ్గురు మృతి 

వారం రోజుల వ్యవధిలో వరంగల్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు అమెరికాలో మరణించారు. ఈ నెల 10న నగరానికి చెందిన కొత్త శ్వేత గుండెపోటుతో మరణించగా, 13న నగరంలోని దేశాయిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చిదురాల విజయరాణి కూడా గుండెపోటుతో మరణిం చారు. ఆదివారం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాడిపత్రి రాకేష్ కూడా గుండెపోటుతోనే మర ణించడం విషాదం.