26 May, 2026 | 4:21 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

తలసాని పిలుపుతో శాంతి ర్యాలీకి ప్రజల భారీ మద్దతు

18-01-2026 09:42 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన ఉద్యమానికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎనలేని ప్రోత్సాహం, సహకారం  అందిస్తున్నారని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో  ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు కలిసి సన్మానించి తమ ఉద్యమానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

220 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరించి ప్రజలు తమ ఉద్యమానికి మద్దతు తెలిపేలా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో కృషి చేశారని అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం నాడు నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ ఉద్యమానికి మద్దతు తెలిపారని, ఆందోళనలో పాల్గొన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ కార్పోరేషన్ ఏర్పాటయ్యే వరకు ఎన్ని అడ్డంకులు కల్పించిన తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.