22 May, 2026 | 8:28 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

కోదాడ కర్ల రాజేష్ మృతికి పూర్తి బాధ్యత పోలీసులదే

06-12-2025 12:12 AM

ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ

ఖైరతాబాద్,(విజయక్రాంతి): కోదాడ కర్ల రాజేష్ పై విచారణ పేరుతో పోలీసులు థర్డ్ డిగ్రీ చేయడం వలనే మరణించాడని అతని మృతి కి పూర్తి బాధ్యత పోలీసు లే వహించాలని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఓ దళిత యువకున్ని ఆకారణంగా కేసులో విచారణ పేరుతో పోలీసులు హత్య చేశారని ఆరోపించారు.

రాజేష్ పై 8వ తారీకు ఫిర్యాదు అందితే అదే రోజు కేసు నమోదు చేసి తొమ్మిదవ తారీకు ఎఫ్‌ఐఆర్ చేసి పదవ తేదీన కోర్టులో హాజరు పరచామని పోలీసులు చెబుతున్నారని ఇవన్నీ కట్టు కదలని ఆరోపించారు.దీనిపై హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి, ఫ్లోరెన్స్ టీం తో రి పోస్టుమార్టం జరిపించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నరసింహ, వేణు కుమార్, శివకుమార్, రాజేంద్ర, లలిత, సుకన్య తదితరులు పాల్గొన్నారు.