31 March, 2026 | 2:56 PM

Breaking News

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •  

పోలీస్ స్టేషన్ ముందు ప్లెక్సీ పంచాయితీ

09-10-2025 12:00 AM

పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ముందు బీజేపీ నేతల ధర్నా 

కల్వకుర్తి సెప్టెంబర్ 8 : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వల్ల ఏర్పడ్డ ఘర్షణ తీర పోలీస్ స్టేషన్ చెంతకు చేరింది ఈ నేపథ్యంలో తమ నాయకుడిని స్టేషన్ కి పిలిచి అకారణంగా చితక బాదారని నిరసిస్తూ బిజెపి నేతలు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకుదిగారు. వివరాల్లోకెళ్తే.. దసరా పండుగ సందర్భంగా వెల్దండ మండలం పెద్దాపురం గ్రామంలో దుర్గామాత వద్ద కొందరు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా మరికొందరు దానిని తొలగించారు.

దీంతో ఇరువురి మధ్య గొడవలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బీజేపీ పార్టీకి చెందిన హరి ప్రసాద్ గౌడ్ ను స్టేషన్ కు పిలిపించి చితకబాదినట్లు బాధితుడు తెలిపారు. దీంతో ఆ పార్టీ నాయకులతో కలిసి బుధవారం స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, నాయకులు ఆ పార్టీ నాయకులు పోలీసులతో మాట్లాడారు. అనంతరం ఆందోళన విరమింప చేశారు.