9 May, 2026 | 5:36 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

బొడ్రాయి వద్దే బస్సులు అగును

20-02-2026 06:08 PM
  • రింగ్ రోడ్డు వద్ద రిక్వెస్ట్ స్టాప్
  • కోదురుపాక సర్పంచ్ డా. కత్తెరపాక మంజుల సుధాకర్

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం, కోదురుపాక వద బొడ్రాయి వద్ద పెర్మనెంట్ బస్సు స్టాప్ కోసం అధికారులు చర్యలు చెప్పట్టారు. అందులో భాగంగా శుక్రవారం సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో నేడు బొడ్రాయి వద్ద తనిఖీలు చేపట్టారు. బొడ్రాయి వద్ద బస్సులు ఆపకుంటే సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 9063152130 గారికి కాల్ చేయాలనీ కోరారు.

ఈ సందర్బంగా కోదురుపాక సర్పంచ్ డా.కత్తెరపాక మంజుల సుధాకర్ మాట్లాడుతూ... బొడ్రాయి వద్ద ఇప్పటి నుండి పేర్మినెంట్ బస్సులు ఆపేందుకు చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ ఆదికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలానే రింగురోడ్డు వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. ఇతర గ్రామాల వారికోసం ఆటో స్టాండ్ కూడా బొడ్రాయి వద్ద ఏర్పాటుకీ సహకరిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలొ కత్తెరపాక సుధాకర్, సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.