20 March, 2026 | 4:18 PM

ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు

20-03-2026 02:54 PM

ముంబై: ముంబై ప్రెస్ క్లబ్(Mumbai Press Club) ప్రాంగణంలో గ్యాస్ బాంబులు అమర్చామని, అవి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు పేలిపోతాయని పేర్కొంటూ ఒక బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న భద్రతా సంస్థలు ఆ భవనంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. అయితే అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు. 

నీరజా అజ్మల్ ఖాన్‌గా తనను తాను పరిచయం చేసుకున్న ఆ ఈమెయిల్ పంపిన వ్యక్తి, ఆ సందేశంలో రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేశారని ఒక పోలీసులు పేర్కొన్నారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బాంబు బెదిరింపు ఈమెయిల్ గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు దక్షిణ ముంబైలోని ప్రెస్ క్లబ్ భవనంలో గాలింపు చర్యలను ప్రారంభించాయి.