17 June, 2026 | 10:55 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

టేకులపల్లిలో 45 మంది అయ్యప్ప భక్తుల మాలధారణ

05-11-2025 07:36 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలో బుధవారం 45 మంది అయ్యప్ప భక్తులు మాలధారణ చేశారు. టేకులపల్లికి చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు గుండా నరసింహారావు ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడిలో నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో మాల వేసుకున్నారు. గుండా నరసింహారావు గురుస్వామి 19వ పడి మాల వేసుకోవడం విశేషం. వీరంతా టేకులపల్లిలోని సంత్ సేవాలాల్ తూర్పు గుడి వద్ద పీఠం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.