28 April, 2026 | 6:52 PM

బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

28-04-2026 04:37 PM

బెంగాల్ లో హైటెన్షన్

యూపీ సింగం వర్సెస్ టీఎంసీ

కోల్‌కతా: బెంగాల్ రెండో దశ పోలింగ్ కు ముందు హైటెక్షన్ నెలకొంది. యూపీ సింగం వర్సెస్ టీఎంసీ అన్నట్లు వార్ కొనసాగుతోంది. యూపీ ఐపీఎస్ అజయ్ పాల్(UP IPS Officer Ajay Pal) దక్షిణ 24 పరగణలో ఈసీ పరిశీలకుడిగా నియామకం అయ్యారు. అజయ్ పాల్ టీఎంసీ అభ్యర్థి జహంగీర్( TMC candidate Jahangir Khan) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు.ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అంతుచూస్తామని హెచ్చరించారు. అజయ్ పాల్ కు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తడాఖా చూపిస్తానని అజయ్ పాల్ కు జహంగీర్ కౌంటర్ ఇచ్చారు.