5 May, 2026 | 6:56 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్

21-12-2025 12:12 AM

శ్రీవివేకానంద పాఠశాలలో నిర్వహణ

గుమ్మడిదల, డిసెంబర్ 20(విజయక్రాంతి) :గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద హై స్కూల్ లో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో సృజనాత్మకతను శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేందుకు శనివారం పాఠశాల కరస్పాండెంట్ చిమ్ముల జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ చిమ్ముల లతారెడ్డి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిమ్ముల జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి శాయశక్తుల కృషి చేస్తామన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించడానికి సుమారు 250కి పైగా ప్రాజెక్టులు ప్రదర్శింపబడ్డాయన్నారు.

ప్రిన్సిపాల్ లతా రెడ్డి మాట్లాడుతూ  పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు   ఉన్నత శిఖరాలకు చేరుకొనే విధంగా తయారు చేయడానికి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం పర్యవేక్షణలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహిస్తున్నామన్నారు.  విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఆత్మవిశ్వాసంతో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులకు అర్థమయ్యే రీతిలో వివరించగా, వాటిని తిలకించిన తల్లిదండ్రులు, సందర్శకులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.