బాబు జగ్జీవన్ రామ్కు ఘన నివాళి
ఆసిఫాబాద్(విజయక్రాంతి): మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి దివంగత బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామంలోని స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.




