4 May, 2026 | 1:06 PM

తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి

04-05-2026 12:13 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం సమీపంలోని ఊరందురు జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ఒక లారీని అంబులెన్స్ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోల్‌కతాకు చెందిన ఒక రోగిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన ఒక లారీని, అంబులెన్స్ వెనుక నుండి ఢీకొట్టింది. అంబులెన్స్‌లో డ్రైవర్‌తో కలిపి మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.